మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`. తమిళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో నయనతార నటించనుందని టాక్ నడుస్తోంది. ఇక ఇటీవలె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరబాద్లో ప్రారంభమైంది. యాక్షన్ సీన్స్తో మోహన్ రాజా షూటింగ్ను షురూ చేయగా.. ఇప్పుడు ఈ మూవీ చిత్రీకరణకు బ్రేకులు పడినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అజిత్ నటిస్తున్న తాజా చిత్రం `వాలిమై`. ఈ సినిమాకి కెమెరామెన్ గా నీరవ్ షా పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ షూటింగ్ కోసం నీరవ్ షా వారం రోజుల పాటు రష్యాకు వెళ్లాల్సి వచ్చిందట. దాంతో గాడ్ ఫాదర్ షూటింగ్ ఆగిందట. నీరవ్ షా రష్యాకు వెళ్తే.. చిరు సినిమా ఆగిపోవడం ఏంటని అనుకుంటున్నారా? ఎందుకంటే గాడ్ ఫాదర్కు కూడా నీరవ్ షానే సినిమాటోగ్రాఫర్. ఇంతకముందే వాలిమై షూటింగ్ కోసం కమిట్మెంట్ ఇవ్వడంతో నీరవ్ షా చిరు సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. దాంతో గాడ్ ఫాదర్ టీమ్కు ఆదిలోనే ఆటకం ఎదురైంది.