ఓటీటీలో `రిపబ్లిక్`..క్లారిటీ ఇచ్చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం రిప‌బ్లిక్‌. దేవా కట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్రలు పోసించారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే రిప‌బ్లిక్ ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఓటీటీ ఆఫ‌ర్లు రావ‌డంతో రిప‌బ్లిక్ మేక‌ర్స్ కూడా అటు వైపే చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ విష‌యంపై సాయి ధ‌ర‌మ్ తేజ్ క్లారిటీ ఇచ్చేశాడు. రిప‌బ్లిక్‌ను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామ‌ని, ఓటీటీలో విడుద‌ల‌య్యే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పుకొచ్చాడు. అలాగే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి రిపబ్లిక్ ను చూసి ఎంజాయ్ చేయాలని కోరాడు మెగా మేన‌ల్లుడు. మ‌రి ఇప్ప‌టికైనా ఈ చిత్రంపై వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ ప‌డ‌తాయో..లేదో..చూడాలి.