నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.
వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య మరో డైరెక్టర్కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి ఫ్లాప్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీవాస్ తో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.
ఇటీవలె శ్రీవాస్ బాలయ్యను కలిసి ఓ పవర్ ఫుల్ కథను చెప్పాడట. అది బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేసేందుకు బాలయ్య ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, గోపీచంద్ మలినేని సినిమా తర్వాత ఈ చిత్రం తెరకెక్కనుందని.. ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే ప్రకటన కూడా రానుందని టాక్.