అక్కినేని అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, ఎకె ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉండే.. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందని, ఆ రోల్లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మమ్ముట్టి రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికిగానూ మమ్ముట్టి ఏకంగా రూ.3 కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.