తాజా అప్డేట్‌..కొర‌టాల గ‌ట్టిగానే ప్లాన్ చేశార‌ట‌!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సిద్ధా అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్ పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సోనూసూద్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.

క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. ప్రస్తుతం చరణ్, సోనూసూద్ పై కుస్తీ పోటీ కి సంబంధించిన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. చాలా ఇంట్ర‌స్టింగ్‌గా సాగే ఈ ఎపిసోడ్‌ను కొర‌టాల గ‌ట్టిగానే ప్లాన్ చేశార‌ట‌.

ఒకానొక కీలకమైన సందర్భంలో వచ్చే ఈ కుస్తీ పోటీ ఎపిసోడ్ సినిమాకు ఒక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ జూలై లాస్ట్‌కు ఫినిష్ కానుంది. అనంత‌రం నిర్మాణ ప‌నులు షురూ చేసి.. ద‌స‌రా బ‌రిలో ఆచార్య‌ను దింపాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.