మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంకర్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ శంకర్ దాదాపుగా రూ.40 కోట్లు డిమాండ్ చేశారట.
కథ బలంగా ఉండటం, ఇండియా లెవల్లో శంకర్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. దిల్ రాజు కూడా అంత మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పారట. ఏదేమైనా దర్శకుడే 40 కోట్లు తీసుకుంటే.. హీరో చరణ్ ఇంకెంత పుచ్చుకుంటున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.