ధ‌నుష్‌-శేఖ‌ర్ క‌మ్ముల మూవీపై న్యూ అప్డేట్‌!?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుంద‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సినిమాని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఇక ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో శేఖర్‌ కమ్ముల ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా, ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్‌ సాయిపల్లవి నటించనుందని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.