కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఇప్పుడు వైసీపీలో సెంటరాఫ్ది టాపిక్గా మారాడు. ఆయన కారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత జగన్ ఫుల్లుగా క్లాస్ పీకాడని సమాచారం. దీంతో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల పెద్దిరెడ్డి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో సేమ్ ఫ్లైట్లో తిరుపతికి బయల్దేరిన మోహన్ బాబు తారసపడ్డారు. పెద్దిరెడ్డికి.. మోహన్ బాబుకు ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి.
దీంతో ఇద్దరూ తమ సొంత విషయాలను మాట్లాడుతూ.. ముచ్చట్లలో మునిగిపోయారు. అందులో భాగంగానే మోహన్ బాబును వైసీపీలోకి ఆహ్వానించారట పెద్దిరెడ్డి. అయితే ఆయన మాత్రం ఏదీ చెప్పకుండానే దాటవేశారట. అంతేకాదు వైసీపీ టాపిక్ వచ్చినప్పుడు ఆయన ముఖంలోనూ ఎలాంటి రియాక్షన్ రాలేదని సమాచారం. ఈలోపు తిరుపతి రానే వచ్చింది. ఇద్దరూ కలిసి తిరుపతి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి… ఎవరి పని మీద వారు వెళ్లిపోయారు. అయితే ఎలా చేరాయో తెలీదుకానీ.. వీరి మధ్య జరిగిన సంభాషణ అంతా వైసీపీ అధినేత జగన్కి చేరిపోయింది.
దీంతో ఒక్కసారిగా జగన్ .. పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యాడంట. ఎన్ని చెప్పినా మోహన్ బాబు టీడీపీ మనిషేనని… అలాంటి వ్యక్తిని వైసీపీలోకి ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించాడట. మోహన్ బాబును తాను ఎప్పుడో ఆహ్వానించానని… అప్పుడే స్పందించని ఆయన… ఇప్పుడు వైసీపీలోకి వస్తారని ఆశించడం అవివేకమని పెద్దిరెడ్డితో చెప్పారట. దీంతో జగన్ రియాక్షన్ చూసి పెద్దిరెడ్డి నొచ్చుకున్నట్టు సమాచారం. ఏదో మాటల సందర్భంలో మోహన్ బాబును వైసీపీలోకి ఆహ్వానిస్తే… ఇంత రాద్ధాంతం అవసరమా అని పెద్దిరెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మొత్తానికి మౌనంగానే మోహన్బాబు వైసీపీలో చిచ్చుపెట్టాడని చర్చించుకుంటున్నారు.