తెలుగు తెరపై రెండు దశాబ్దాలుగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్ద కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈ దశాబ్ద కాలంలో చిరు ఇమేజ్ మగధీర, బ్రూస్లీ సినిమాల్లో నటించడం మినహా హీరోగా ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇక ఇప్పుడు భారీ గ్యాప్ తర్వాత చిరు మళ్లీ మొఖానికి రంగేసుకుని తన 150వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఖైదీ నెంబర్ 150 పేరుతో తెరకెక్కుతున్న చిరు 150వ సినిమా కావడంతో ఈ సినిమా బిజినెస్ ఓ స్థాయిలో జరుగుతోందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఖైదీ నెంబర్ 150 సినిమా ఆంధ్ర హక్కులు 32 కోట్ల రూపాయలకు అ మ్ముడైనట్టు తెలుస్తోంది.
తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద హిట్గా నిలిచిన బాహుబలి సినిమా ఆంధ్రా హక్కులు సైతం రూ.30 కోట్లకు అమ్ముడవ్వగా ఇప్పుడు ఆ సినిమానే మించేలా చిరు ఖైదీ నెంబర్ 150 సినిమా బిజినెస్ జరిగింది.
ఇక చిరు ఫ్యామిలీకి బాగా పట్టున్న ఉత్తరాంధ్ర ఏరియాలో ఖైదీ నెంబర్ 150 హక్కులను 7.7 కోట్ల రూపాయలకు అమ్మారట. ఇంతకుముందు బాహుబలి, సర్దార్ గబ్బర్సింగ్ హక్కులను 7.2 కోట్లకు విక్రయించారట. మొత్తానికి చిరంజీవి తన రీ-ఎంట్రీ సినిమాతో బాహుబలి సినిమాకే షాక్ ఇస్తున్నారన్నమాట.