ఆ వైసీపీ నేత‌ల‌పై పీకే కంప్లైంట్‌

రానున్న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో భాగంగా.. న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి త‌నను అధికారంలోకి తీసుకొస్తాయ‌ని ఎన్నో ఆశ‌లుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్ర‌చారం చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల స‌భ‌లు, స‌మావేశాలు పెట్టి ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. నేత‌లు వీటిని స‌క్ర‌మంగా ప్ర‌చారం చేస్తున్నారా? లేదా అనే అంశాల‌పై వైసీపీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలో షాకింగ్ ఫ‌లితాలు వ‌చ్చాయ‌ట‌. […]

వైసీపీలో పండ‌గ‌.. జ‌గ‌న్ లండ‌న్ టూర్‌!

రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి ఒకింత ఎదురు దెబ్బ‌త‌గిలినా.. తాజాగా ఓ వార్త మాత్రం ఉత్సాహం నింపింది. పార్టీ అధినేత జ‌గ‌న్ పెద్ద కుమార్తెకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు ల‌భించింది. దీనిని ఆ పార్టీ నేత‌లు, అభిమానులు పెద్ద పండ‌గ‌లా చేసుకుంటున్నారు. ఎంద‌కంత పండ‌గ‌? ఎందుకింత హంగామా? అంటే.. నిజానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అతి పెద్ద ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌. ఎంతో మేధావులు ఈ సంస్థ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లే. […]

చంద్ర‌బాబు జోరు… జ‌గ‌న్ బేజారు!

ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీలు అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య ఇప్పుడు విచిత్ర వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అధికార పార్టీ సాధార‌ణంగా జోరు మీదుండ‌డం స‌హ‌జం. అయితే, ఇప్పుడు ఆ పార్టీ జోరుతో పాటు మ‌రింత హుషారుగా కూడా ఉంది. ముఖ్యంగా మొన్న జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఫ‌లితాల అనంత‌రం టీడీపీలో పెద్ద ఎత్తున కొత్త ఆక్సిజ‌న్ అందింది. దీంతో అధినేత చంద్ర‌బాబు స‌హా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలా […]

నంద్యాల ఫ‌లితం త‌ర్వాత‌…. పీకే-జ‌గ‌న్ మ‌ధ్య ఏం జ‌రిగింది

నంద్యాల ఉప ఎన్నికకు ముందు వ‌ర‌కు వైసీపీ ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్‌లో మార్మోగింది. నార్త్‌లో ప్ర‌ధాన‌మంత్రి మోడీ నుంచి ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా స‌క్సెస్ ఫుల్ రిజ‌ల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా రావ‌డంతో అంద‌రి దృష్టి ఆయ‌న‌మీదే ఉంది. ఆయ‌న వ్యూహాలు ఇక్క‌డ కూడా వైసీపీకి ప‌ని చేస్తాయ‌న్న న‌మ్మ‌కంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పీకే త‌న వ్యూహాలు అమ‌లు చేశారు. […]

కాపుల‌కు కాపు కాస్తావ్‌….. మ‌రి హామీలెందుకు ఇవ్వ‌వ్ జ‌గ‌నూ..!

వ్రతం చెడ్డా ఫ‌లితం ద‌క్కింద‌నేది తెలుగు సామెత‌. కానీ వృతం చెడింది.. ఫ‌లినేతం కూడా రాలేద‌న్న‌ట్లుగా మారిందిప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌రిస్థితి. కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీద‌కు వ‌చ్చాక ఆంధ్రప్ర‌దేశ్‌లో ప‌రిస్థితుల్లో చాలా మార్పు వ‌చ్చింది. ఎప్ప‌డు ఎన్నిక‌లొచ్చినా ఇదే అంశం ప్ర‌భావం చూప‌తుంద‌ని అంద‌రూ భావించారు. ప్ర‌త్యేక హోదా అంశం త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్నిఅంతంగా కుదిపేసిన అంశం ఏదైనా ఉందంటే అదీ కాపు రిజ‌ర్వేష‌న్లే. మ‌రీ ముఖ్యంగా వేరే అంశమే లేద‌న్న‌ట్లుగా వైసీపీ నేత‌లు […]

జ‌గ‌న్ రాంగ్ స్టెప్‌తోనే వైసీపీలో కుమ్ములాట‌లు

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నం మీద ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి షాకిస్తున్నారు పార్టీ దిగువ‌స్థాయి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు. రెండు రోజుల కింద‌ట విజ‌య‌వాడ‌లో గౌతంరెడ్డి, వంగ‌వీటి రాధా కృష్ణ‌ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌తో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రువు పోయింది. అదేవిధంగా కాకినాడ‌లో జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌లో వైసీపీ ప‌రాజ‌యం పాలైంది. దీనికి కూడా వ‌ర్గ‌పోరు కార‌ణ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఈ కుమ్ములాట‌ల‌కు, ర‌గ‌డ‌ల‌కు జ‌గ‌నే కార‌ణ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. […]

భ‌గ్గుమ‌న్న వంగ‌వీటి ఫ్యాన్స్‌…. బంధువును బ‌య‌ట‌కు పంపేసిన జ‌గ‌న్‌

మూలిగే న‌క్క‌మీద తాటిపండు చందంగా ఉన్న బెజ‌వాడ వైసీపీలో ఇప్పుడు పెద్ద ముస‌లం మొద‌లైంది. వైసీపీ ట్రేడ్ యూనియ‌న్ నాయ‌కుడు పూనూరు గౌతంరెడ్డి కాపుల‌తో పాటు వంగ‌వీటి రంగా, ఆయ‌న త‌న‌యుడు రాధాపై చేసిన వ్యాఖ్య‌లు పార్టీని అట్టుడికించాయి. గౌతంరెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైసీపీ నాయకులపై చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు అటు పార్టీలోను, ఇటు కాపుల్లోను తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. కాపులు, వంగ‌వీటి అభిమానులు అయితే గౌతంరెడ్డితో […]

జ‌గ‌న్‌పై టీడీపీ అంచ‌నాలు తారుమారు!

ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోష‌ల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జ‌గ‌న్‌ను టైగ‌ర్‌తో పోలుస్తూ.. ప‌లువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కార‌ణం.. నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అతి పెద్ద దెబ్బ త‌గిలిన వైసీపీ ఇక నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని, ఆ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన టీడీపీ పెద్ద‌ల‌కు జ‌గ‌న్ షాకివ్వ‌డ‌మే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక‌ను జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. గెలుపు త‌థ్యం అనుకున్నాడు. శ‌క్తికి మించి ప్ర‌చారం చేశాడు. ఓ రాష్ట్ర […]

వైసీపీకి మంచి జోష్..ఒకేసారి న‌లుగురు మాజీ మంత్రులు!

ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైసీపీ కాస్త నిస్తేజంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్న‌ట్టు కూడా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని టీడీపీ మంత్రులు కూడా ప్ర‌క‌టిస్తున్నారు. ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లే సాహ‌సం ఎవ‌రైనా చేస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే రాజ‌కీయాల్లో అవ‌కాశం కోసం కాచుకుని కూర్చొనే […]