కిషన్‌ మౌనం వెనుక అంతరార్థమిదేనా?

సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మంతి కిషన్‌ రెడ్డి ఇటీవల కాలంలో సైలెంట్‌గా ఉండిపోయారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌పై విమర్శలు పెద్దగా చేయడం లేదు. గతంలో అయితే టీఆర్‌ఎస్‌ పార్టీని నిరంతరం టార్గెట్‌ చేసే కిషన్‌ రెడ్డి ఇప్పుడెందుకిలా మౌనంగా ఉండిపోతున్నారని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. అయితే ఆయన మౌనం వెనుక కేంద్రం పెద్దలు ఉన్నారని, కావాలనే ఆయనను సైలెంట్‌గా ఉండాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అందుకే కిషన్‌ రెడ్డి కేవలం తన శాఖాపరమైన […]

తెలంగాణపై జనసేనాని దృష్టి..కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకున్న అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఆయన ఏపీపైనే ఫోకస్ చేశారు. సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, మేధావులతో చర్చలు.. ఇలా అన్నీ ఏపీ కేంద్రంగానే సాగాయి. మరెందుకో పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ గురించి ఆలోచించడం లేదు. పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్ పవన్ మాటలకు బాగా కనెక్ట్ అవుతారు. దీనిని […]

కేటీఆర్ కు ఛాన్స్.. ఎర్రబెల్లికి నో ఛాన్స్.. ఇదేంది సారూ..!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన కుమారుడు కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదేంటి.. కేటీఆర్ .. ఆయన కుమారుడు.. మరి కుమారుడికి కాక ఎవ్వరికి ప్రాధాన్యం ఇస్తారు అని కూడా అనుకుంటారు. అయితే అభిమానం, ప్రేమ అనేవి మన వ్యక్తిగత విషయాలు.. వాటిని వ్యక్తిగతంగానే చూడాలి. అధికారికంగా వాటిని బహిర్గతం చేయరాదు. అవకాశం అనేది అందరికీ ఇవ్వాలి.. కుమారుడికి ఇచ్చి.. ఇతరులకు ఇవ్వకపోతే పక్షపాతం చూపుతున్నారు అంటారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా […]

ఉన్నది మూడు నెలలే… ఆ తరువాత?

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కొత్త టెన్షన్ మొదలైంది. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో అంటే మరో మూడు నెలల్లో ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అదేంటి.. ఆమె ఎమ్మెల్సీగా గెలిచింది గత సంవత్సరమే కదా .. ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నిజామాబాద్ లో కవిత గెలిచింది ఉప ఎన్నికల్లో.. అప్పటికే సమయం […]

మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మం‍త్రి, టీ కేటీఆర్‌ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాం‍గ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన […]

దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ […]

కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]

దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ మరో అడుగు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలకు చక్కర్లు కొట్టిన కారు పార్టీ అధినేత ఈసారి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రయాణానికి పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద నాయకులకు విమాన ప్రయాణాలు అరేంజ్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ […]

కేటీఆర్‌ను సాయం అడిగిన ర‌ష్మి..దేనికోస‌మంటే?

బుల్లితెర అందాల యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మి గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన ఈ భామకు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. మూగ జీవాలపై తన ప్రేమను చాటుతూ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూనే ఉంటుంది. అలాగే లాక్‌డౌన్‌లో వీధి కుక్క‌ల ఆక‌లి తీర్చి అంద‌రి మెప్పు పొందిన ర‌ష్మి.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను […]