SSMB 29.. మహేష్ బాబు ఎంట్రీ సీక్వెన్స్ పై జక్కన్న ప్లాన్ లీక్..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో.. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు.కాగా సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా బయటకు లీక్ కాకుండా జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న.. సినిమాకు సంబంధించిన ఏదో ఒక రూమర్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా జక్కన్న నెక్స్ట్ షెడ్యూల్ ప్లానింగ్ గురించి నెటింట‌ వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి నెక్స్ట్ షెడ్యూల్‌లో ఈ సినిమా మహేష్ బాబు ఎంట్రీ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సీక్వెన్స్ స్కెడ్యూల్‌ మహేష్ బాబుతో పాటు.. ప్రియాంక చోప్రా కూడా షూటింగ్లో పాల్గొననుందట. వీరిద్దరి పాత్రలు పరిచయాలతో పాటు.. కథ తాలూకా గమనాన్ని కూడా సీక్వెన్స్ లో రివీల్‌ చేయనున్నారు అని లీక్ ఇప్పుడు తెగ వైర‌ల్‌గా మారుతుంది.

Priyanka Chopra shares glimpses from 'SSMB29' sets in Odisha with Mahesh  Babu and Prithviraj Sukumaran; SS Rajamouli tightens security to prevent  leaks | - The Times of India

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా కథకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశాడు. ప్రధానంగా నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద ఫ్యాన్స్ అని.. అందుకే ఆయన పుస్తకాలు ఆధారంగానే సినిమా స్క్రిప్ట్ ను తయారు చేశామంటూ వివరించాడు. అయితే.. ఈ మూవీ ప్ర‌స్తుతం అడ్వంచ‌ర్స్ థ్రిల్ల‌ర్‌గా రానున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మరో డైరెక్టర్ దేవకట్ట సంభాషణలు సమకూర్చాడు.