సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న నయనతారకు కేవలం తెలుగు, తమిళ, కన్నడ భాషలోనే కాదు బాలీవుడ్లోనూ మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. కోలీవుడ్లో తిరుగులేని క్రేజీ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ ప్రత్యేకమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత అమ్మడి క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కోలీవుడ్ దర్శకుడు విజ్ఞేష్ శవన్ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు పెళ్ళికి ముందు శింభు, ప్రభుదేవలతో ప్రేమాయణం నడిపి హాట్ టాపిక్గా మారింది.
వివాహం తర్వాత కూడా ఈమె జీవితంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. విమర్శలను చూసింది. సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పై పెద్ద దుమారమే రేగింది. తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్తోను ఈమె వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడుకు సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 100 కోట్లు ఇచ్చిన సరే ఒక హీరోతో మాత్రం తను నటించినని తెగేసి చెప్పిందట నయనతార. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు శరవణన్. తెలుగు, తమిళ్, కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ క్రేజీ హీరోకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
శరవణన్ హీరోగా ది లెజెండ్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెల హీరోయిన్గా మెరిసింది. అయితే.. మొదట ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్గా భావించారు. నయనతారను అప్రోచ్ అయ్యి స్టోరీ వినిపించగా.. శరవణన్ పక్కన హీరోయిన్ గా నేను నటించాలా.. 100 కోట్లు ఇచ్చినా అది జరగదు అంటూ తెగేసి చెప్పిందట. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. దీనిపై ఇప్పటివరకు అటు నయన్ కానీ.. ఇటు శరవణన్ కానీ ఎవరు రియాక్ట్ కాలేదు. ఇక ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ను మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే నయన్ ఆ సినిమాలో నటించకుండా మంచి పని చేసింది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.