భారత్, పాకిస్తాన్ ఉద్రక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించడం సర్వాత్ర ఆసక్తి నెలకొల్పుతుంది. ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో ఈ భేటీ జరపడం మరింత హైలెట్. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్.. అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళ అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్ కూడా.. ఈ సమావేశంలో పాల్గొన్నాడు. భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద నేపథ్యంలో ఈ భేటీ మరింత స్పెషల్ గా మారింది. భారత్, పాక్ కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు డ్రోనా ట్రంప్ అధికారికంగా ప్రకటించిన కొద్దిసేపటికే.. పాకిస్తాన్ తన దొంగబుద్ధిని చూపించింది. కాశ్మీర్ నాగ్రో ప్రాంతాల్లో మళ్ళీ దాడులకు పాల్పడి సంచలనంగా మారింది. దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోడీ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే భేటీ మరింత కీలకంగా కానుందట. పాకిస్థాన్ను మరోసారి నిలువరించాలన్న ఉద్దేశంతో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ చర్చిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం కొనసాగుతోందట. ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇప్పుడు ఇండియాలో ఆసక్తి నెలకొంది. నమ్మించి మోసం చేసిన పాక్.. మరోసారి గట్టి సమాధానం చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పాక్తో యుద్ధాన్ని కొనసాగించి.. భారత్ ఆర్మీ సత్తా ఏంటో చూపించాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాని మోడీ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాల్సి ఉంది.
దీనికి తగ్గట్టుగానే మరోవైపు మే 12 (రేపు) సోమవారం భారత్, పాకిస్తాన్ ఆర్మీ బెటీ జరగనుంది. ఈ భేటీలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సరిహద్దు భద్రత సైనిక చర్య సన్నదత.. తదితరాంశాలపై దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ మాత్రం మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేస్తుండగా.. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ అవసరమని వెల్లడిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ వక్రబుద్ధి చూపిస్తూ దొంగ దెబ్బ కొట్టింది. కాల్పుల విరమణకు తలఊపి.. తోక జాడించి మోటార్ సెల్లింగ్, డ్రోన్లతో వరుసగా నాలుగో రోజు దాడులకు పాల్పడడం ఇండియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇందులో 7 గురు మృతి చెందినట్లు సమాచారం.