భారత్, పాక్ పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కాల్పుల.. విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే పాక్ కాల్పులకు దిగడం వెనుక అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి. పాక్ ప్రభుత్వం మాటలు సైన్యం వినడం లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. పాక్ ఆర్మీ తమ పరువును నిలుపుకునేందుకు ప్రభుత్వం మాటను బేకాతరు చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తుందని తెలుస్తోంది. పాకిస్తాన్లో ప్రభుత్వం పై.. ఆర్మీదే ఎప్పుడు పై చేయిగా ఉంటుంది. సైనిక తిరుగుబాట్లు సర్వసాధారణం. ఇలాంటి క్రమంలోనే కాల్పుల విరమణ ఆదేశాలకు పాక్ సైన్యం కట్టుబడి లేదని చర్చలు వైరల్ గా మారుతున్నాయి.
ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తీరుని సైతం పాక్ సైన్యం తప్పు పడుతుందా.. అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిన సంగతి తెలిసింది. 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేసినప్పటి నుంచి పగతో రగిలిపోయిన పాక్.. ఇలాంటి క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఆర్థిక సహాయాన్ని.. కాల్పుల విరమణ పాటిస్తేనే చేస్తామని చెప్పడంతో.. పాక్ దిక్కుతోచక కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా.. కాళ్ళ వేళ్ళపడి బతిమాలి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేయించారు. కానీ.. ప్రభుత్వం దేశ పరిస్థితిని అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పాటు.. నిల్వలు కూడా తగ్గడంతో పాక్ దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే.. పాక్ సైన్యం మాత్రం ప్రభుత్వ మాటలను పెడచెవిన పెట్టిందని.. విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసిందని సమాచారం. రేపు ఇరుదేశాల సైనిక కార్యకలాపాల డైరెక్ట్ జనరల్ చర్చలు జరగనున్నాయి. అదే సమయంలో మళ్ళీ కాల్పులకు తెగబడుతుండడంతో.. పాలన వర్గాలు కూడా పాక్ సైన్యం చేతిలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయని.. అంతర్జాతీయ విశ్వేషకులు చెబుతున్నారు. గంటల్లోనే ఉల్లంగించి కాల్పులకు తెగబడ్డం అంటే.. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేయడమేనని చెప్తున్నారు. సైనికుల తమ దేశాన్ని నడిపించేందుకు సిద్ధమయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సైన్యం చెప్పు చేతుల్లోకి పాక్ పాలన వెళ్ళిపోయే సంకేతాలు ఉన్నాయని సమాచారం. మొత్తం మీద పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య నెలకొన్న ఈ గ్యాప్ తో.. మరోసారి భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. పాక్లో పేరుకే ప్రభుత్వం.. పెత్తనం అంతా సైన్యానిదే. ఏ దేశ అధినేత కూడా ఐదేళ్లు పాటు వరుసగా పాక్లో పాలించిన దాఖలాలే లేవు. భారత్.. పాక్ పైకి దాడులకు దిగి అన్ని స్థావరాలను నాశనం చేస్తున్న క్రమంలో.. సైన్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి. నిద్రపోతున్నారా అంటూ నిలదీయడం మొదలైంది. పోయిన పరువు నిలబెట్టుకునేందుకు కాల్పుల విరమణకు వ్యతిరేకంగా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడిందని చెప్తున్నారు. అందుకే సరిహద్దుల్లో కాల్పులకు దిగి.. తమ వంకర బుద్ధిని చూపిస్తున్నారని తెలుస్తుంది.