తన గొంతుతోనే అందర్నీ ఫిదా చేసిన అమ్మడు.. పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా..!

ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత చదువు రీత్యా విదేశాలకు వెళ్లి.. ఇండస్ట్రీకి దూరమైన ఎంతో మంది సెలబ్రిటీస్ మళ్లీ నటన‌పై ఉన్న ఆసక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వెంటనే తిరిగి వచ్చేసి మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సినీ రంగంలో స్టార్ సెలబ్రిటీలుగా.. హీరో, హీరోయిన్గా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అలా సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా ఒకటి. ఎన్నో సినిమాల్లో బాలనటిగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తండ్రి.. ఓ నిర్మాత, తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.

అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమమైనటిగా జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? మరెవరో కాదండి ఆమె మహానటి కీర్తి సురేష్. చైల్డ్ హుడ్‌లో ఎన్నో పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఇక కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్.. కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్గా రాణించారు. ఇక 2000లో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ అయి అది పూర్తి చేసుకుని మళ‌యాళ‌ గీతాంజలితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. రామ్ పోతినేని సరసన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది.

ఇక తర్వాత నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ మహానటిలో నటించి లక్షలాదిమంది ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. సావిత్రి మళ్ళీ దిగివచ్చిందా అన్నట్లుగా ఆమె నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ జాతీయ నటి అవార్డును దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చినా తన ఇమేజ్ను పోగొట్టుకోకూడదని ఉద్దేశంతో ఆచితూచి ఈడుగులు అడుగులు వేసింది. కేవలం గ్లామర్ రూల్స్ సినిమాలే వస్తున్న క్రమంలో.. సఖి మిస్ ఇండియా, గుడ్ క్లారిటీ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలో మెప్పించింది. హీరోయిన్ పాత్రలే కాకుండా స్టార్ హీరోల చెల్లెలు గాను కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ చిరు రజినీకాంత్ చెల్లెళ్ల పాత్రలో నటించిన కీర్తి.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తుంది.