అలనాటి అందాల తార దివంగత నటి సావిత్రి కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో పాటు డైలాగ్ డెలివరీతోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అమ్మడకు బాగా సెట్ అయ్యేలా పి.లీలా ప్లే బ్యాక్ సాంగ్స్ ను సినిమాలో వాడుతూ ఉండేవారు. సావిత్రి మొదటి రోజులో నటించిన మాయాబజార్, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ లాంటి సినిమాలకు ఆమె పాటలు పాడేవారు. ఆమె పాడిన పాటలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలో సావిత్రి కూడా తన అన్ని సినిమాలకు పి.లీల నే పాడాలని పట్టుబట్టేవారట. అయితే కొంతకాలానికి సావిత్రి సినిమాలకు సుశీల పాటలు పాడడం మొదలుపెట్టారు.
లీల తర్వాత మళ్లీ పి.సుశీల గాత్రం మాత్రమే సావిత్రికి అంతలా సెట్ అయింది. సావిత్రి నటించిన ఎన్నో సినిమాల్లో సుశీల గాత్రాన్ని అందించారు. ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ క్రమంలో సుశీల తప్ప మరెవరు తనకు పాటలు పాడిన తీవ్రంగా అభ్యంతరాలు చెబుతూ వచ్చేది సావిత్రి. ఇలా ఓ సమయంలో పాట విషయంలో జానకికి సావిత్రికి మధ్యలో మనస్పర్ధలు ఏర్సడ్డాయట. దాంతో సావిత్రికి పాటపాడేదే లేదంటూ జానకి కుండబద్దలు కొట్టిందని. అంతేకాదు సావిత్రిని.. జానకి రెండు నెలల పాటు బాగా ఏడిపించిందని సమాచారం.
గతంలో జానకి పడితాండ పత్తిని అనే ఓ తమిళ సినిమాలో సాంగ్ పాడారు. అది మంచి మెలోడీ సాంగ్ కూడా. రికార్డింగ్ అంత అయిపోయిన తర్వాత సినిమాలో నటిస్తున్న సావిత్రి.. పాటను విని బాగా డిసప్పాయింట్ అయ్యారట. తనకు పి.సుశీల పాడితేనే సెట్ అవుతుందని.. ఆమె పాడితేనే సినిమాలో చేస్తానని మొండిగా పట్టుబట్టారట. దాంతో సినిమా టీం చేసేదేమీ లేక.. జానకి పాటలను పక్కకు తపించి సుశీలతో ఆ పాటను పాడించారు. ఈ విషయంలో బాగా హర్ట్ అయినా జానకి తీవ్ర మనస్థాపానికి గురైందని.. ఆ బాధలో సావిత్రికి ఇకపై పాటలు పాడకూడదని బలంగా ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా తర్వాత జానకి.. సావిత్రి సినిమాల్లో పాడే అవకాశం మూడు సినిమాలకు వచ్చిందట.
ఆయన వాటిని సింపుల్గా రిజెక్ట్ చేసింది. అలా 1962లో జెమినీ గణేషన్, సావిత్రి కలిసి కొంజమన్ సలంగై సినిమాలో నటించారు. ఈ సినిమాను మురిపించే మువ్వలు పేరుతో తెలుగులో డబ్ చేశారు. అందులో పాటలు తెలుగు సింగర్స్ తోనే పాడించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పాట సంగీత ప్రధానంగా సాగుతుంది. దానికి సావిత్రికి ప్లే బ్యాక్ పాడే లీలా పాడలేనని చెప్పేశారు. దీంతో సావిత్రికి గట్టి దెబ్బతగిలింది. అప్పట్లో ఆ పాటకు ఒక జానకి మాత్రమే న్యాయం చేయగలరని డైరెక్టర్ ఎస్ఎం. సుబ్బయ్య గట్టి నమ్మకం. దీంతో ఆమెను కాంటాక్ట్ అయినా సుబ్బయ్యకు జానకి ఎంత బ్రతిమలాడినా నో చెప్పేసింది. చివరకు లతా మంగేష్కర్తో ఆ పాట పాడించాలని టీం ముంబైకి వెళ్లారు. కానీ కొన్ని కారణాలతో ఆమె కూడా పాటను రిజెక్ట్ చేశారు.
ఈ క్రమంలో రెండు నెలల పాటు జానకి.. సావిత్రితో పాటు మొత్తం సినిమా టీమ్ అందరినీ ఏడిపించారు. ఇక చేసేదేమీ లేక టీం మొత్తం మళ్లీ జానకి వద్దకు వెళ్లి వేరే వారితో డ్యాన్స్ చేపిస్తామని.. సావిత్రి పాటలో ఉండనే ఉండదని.. ఆమెకు మీరు పాడాల్సిన పనిలేదు అంటూ రిక్వెస్ట్ చేశారు. దీనికి ఒప్పుకున్న జానకి ఆ పాట పాడారు. అయితే సినిమా టీం కేవలం జానకిని ఒప్పించడానికి మాత్రమే ఆ మాట అన్నారు. చివరకు సావిత్రిని ఆ పాటలో నటింపజేసి రిలీజ్ చేశారు. ఆ పాటే.. నీ లీల పాడెద దేవా. ఈ పాట అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటికీ ఈ పాటను వినేవారు ఎంతోమంది ఉన్నారు. జానకి పాడిన బెస్ట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ విధంగా సావిత్రిని జానకి ఏకంగా రెండు నెలల పాటు ఇబ్బంది పెట్టారు.