టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. సౌత్ ఇండియాలోని భారీ తారాగణంతోపాటు.. నార్త్లోను పలువురు స్టార్ సెలబ్రెటీలతో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ కల్కి 2898 ఏడి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూసిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కల్కి.. మొదట ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ తో 2020 ఫిబ్రవరి 26న వైజయంతి మూవీస్ బ్యానర్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది.
ఇప్పటివరకు భారతియ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా కల్కి రికార్డ్స్ సృష్టించింది. దాదాపు రూ.700 కోట్లను సినిమా కోసం మేకర్స్ ఖర్చు పెట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఆధ్యాత్మిక విఎఫ్ఎక్స్ తో క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ ఇంత భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం టీం ఐమ్యాక్స్ డిజిటల్ కెమెరా ని ఉపయోగించారట. ఆరి అలెక్స్ 65, యారి డిఎన్ఏ లెన్స్ ను ఉపయోగించి 6.5కే రిజల్యూషన్లో సినిమాను తెరకెక్కించారని తెలుస్తుంది. దీని కారణంగా ఐమాక్స్ ఫార్మేట్ కు అప్ స్కేలింగ్ సులువుగా జరిగిందట. దీంతో పిక్చర్ క్వాలిటీ కూడా మరింత క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ తరహా టెక్నాలజీని వాడి తెరకెక్కించిన మొదటి భారతీయ సినిమా కూడా కల్కి కావడం విశేషం.
ఇక ఈ సినిమా మూడు ప్రపంచాల మధ్య కనెక్టివిటీతో రానుందని నాగ్ అశంవిన్ గతంలో స్వయంగా వివరించాడు. భవిష్య ప్రపంచంలో వనరులన్నీ కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీ పట్టణం ఉన్నట్లుగా సినిమాలో చూపించారు. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక కాంప్లెక్స్ డిజైన్ చేసి సర్వమథ్థులు ఉండే ప్రాంతంగా సంబాల అనే ప్రాంతాన్ని డిజైన్ చేశారు. వీటి అవుట్ లుక్ మొత్తం గ్రాఫిక్స్ ద్వారా తెరకెక్కించారు. దీనికోసం 7 వి ఎఫ్ ఎక్స్ షాట్స్ ఉపయోగించారట. ఇక ఈ సినిమా కోసం భారీ హాలీవుడ్ సినిమాలకు పని చేసిన ఎంతోమంది టీం పనిచేశారు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో, కమల్ హాసన్ సుప్రీం యస్కిన్ అనే నెగటివ్ రోల్ లో నటించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో కనిపించారు.
ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ వయసు 81 ఏళ్ళు. అయినా ఈ సినిమాకు మేకోవర్ కోసం సుమారు మూడు గంటలు.. దాన్ని తీయడానికి రెండు గంటల సమయాన్ని వెచ్చించి మరి నటించారు. ఇక ఈయన యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న క్రమంలో తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఇక కమలహాసన్ సుప్రీమ్ యస్కిన్గా నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలో ఆయన కనిపిస్తున్న లుక్ కోసం ఎన్నో టెస్టులు చేసి.. లాస్ ఏంజెల్స్ వెళ్లి చివరకు హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే మేకప్ ఎక్స్పర్ట్లను తీసుకువచ్చి పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ చేశారట. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ ఏంటంటే.. మలయాళ సీనియర్ నటి శోభన దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాల్లో ఎన్నో సర్ప్రైజ్ లో ఉన్నాయి.
ఇప్పటికే ఎంతోమంది గెస్ట్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి కూడా భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ వాడే బుజ్జి వెహికల్ కి మహేంద్ర రీసెర్చ్ వ్యాలి టీం తో పాటు కోయంబత్తూర్ లోని జయం ఆటో ఇంజనీరింగ్ టీం కూడా కలిసి పని చేశారట. కేవలం ఈ ఒక్క కారు కోసం యూనిట్ రూ.4 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో ఈ బుజ్జి పాత్రకు టాలీవుడ్ స్టార్ డ్యూ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించింది. ఇక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎన్నో ఫార్మేట్లలో రూపొందించారు మేకర్స్. 2d, 3d, ఐమాక్స్,4DX లోను సినిమాను రిలీజ్ చేశారు. విదేశాల్లో 4DXలో విడుదలైన మొదటి సినిమా కల్కి కావడం గమనార్హం. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడంతో సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రి సేల్స్ తోనే మూడు మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా.. అక్కడ వచ్చిన హైప్తో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.