టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ చేకూరి, డాక్టర్.విజయేంద్ర రెడ్డి తీగల సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న క్రిష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడట. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి కృష్ తప్పుకోవడంతో నిన్న మొన్నటి వరకు వార్తలు తెగ అయినా సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని ఇప్పుడు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గా ఎం. ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ కంప్లీట్ చేయనన్నాడు.
అయితే తాజాగా వరుణ్ తేజ్ తో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను తెరకెక్కించడానికి క్రిష్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు క్రిష్ ప్రొడ్యూసర్ గా వివరించనున్నాడట. ఇంతకీ ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా.. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.