బెంగళూరు రేవ్ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటకలోని భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు పోలీసులు ఈ పార్టీలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజు తమ ముందు హాజరు కావాలని వారు క్లారిటీ ఇచ్చారు. నటి హేమ తో పాటు ఈ ఘటనలో మరో 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టి ఘటనలో పోలీసులు 103 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా.. అందులో 86 మందుకి డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని.. రేవ్ పార్టీలో రాజకీయ, సినీ వర్గాలకు చెందిన బడా బాబుల పిల్లలు ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో వాళ్ళందరికీ పోలీసులు వేరువేరు తేదీలలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారట.
బెంగళూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇండస్ట్రీలో తీవ్ర చర్చ మొదలైంది. నటి హేమ గురించి వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయితే తాజాగా నటి హేమ ఇన్సిడెంట్ ఫై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడాడు. రేవ్ పార్టీ ఘటనలో కొన్ని మీడియా సంస్థలు నటి హేమా పై నిరాధార వార్తలు రాస్తున్నాయని.. హేమా దోషిగా రుజువయ్యే వరకు ఆమె నిర్దోషి అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆమె సమాజంలో ఒక భార్యగా, తల్లిగా, నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందని.. ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందంటూ వివరించాడు.
ఆమె ఇమేజ్ దెబ్బ తీసేలా వార్తలు రాయడం అన్యాయమని.. పోలీసులు కచ్చితంగా ఎవిడెన్స్ చూపించినప్పుడు.. నేరం రోజువైనప్పుడు మేము కూడా ఆమెపై తగిన చర్యలు తీసుకుంటాం. అప్పటివరకు మీడియాలో నిరాధార కథనాలు రాయడం మానేయండి అంటూ ట్యూగ్ చేశాడు మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించదు.. తప్పక ఖండిస్తుందని ఆయన వివరించాడు. అయితే హేమా ఈ పార్టీలో పాల్గొనలేదంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికి బెంగళూరు పోలీసులు ఆమె పార్టీలో పాల్గొన్న ఫోటోను రివీల్ చేశారు. దీంతో ఆమెకు బిగ్ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఆమె రేపు(మే 27)పోలీసుల ముందు హాజరు కావాలంటూ నోటీసులో జారీ చేశారు.