ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో.. బెంగుళూరు రేవ్ పార్టీ ఇన్సిడెంట్ పెద్ద దుమారంగా మారింది. ఈ పార్టీకి పలువురు రాజకీయ నాయకులు.. హీరో, హీరోయిన్లు హాజరయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో తెలుగు నటి హేమ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. హేమతో పాటు చాలా మంది తెలుగు నటులు ఉన్నారంటూ బెంగళూరు పోలీసులు వివరించారు. అయితే వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు. ఈ రేవ్ పార్టీలో తాను లేనంటు నటి హేమ ఓ వీడియోను రిలీజ్ చేయగా.. ఆమె వీడియో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రేవ్ పార్టీ జరిగిన ప్రదేశంలో హేమ ఉన్న ఫోటోలు బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. దీనితో హేమ కవరింగ్ విషయం సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది.
రేవ్ పార్టీ గురించి ఏమాత్రం మాట్లాడకుండా.. ఇంట్లో నేను ఉన్నాను అంటూ ఆమె వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ, యాంకర్ శ్యామల కూడా ఉన్నారంటూ ప్రచారాలు జరిగాయి. కానీ వీళ్ళు లేమంటూ ఆ పార్టీ గురించి తమకేం తెలియదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో తెలుగు నటి ఆషీ రాయ్.. ఈ బెంగుళూరు రేవ్ పార్టీలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆషీ రాయ్ మాట్లాడుతూ తను పార్టీకి వెళ్లానని.. కానీ అది బర్త్డే మాత్రమే అంటూ వివరించింది.
వాసు అనే వ్యక్తి సన్ సెట్ టు సన్రైజ్ కాన్సెప్ట్ తో రేవ్ పార్టీని ఏర్పాటు చేశాడని.. ఆయన బిల్డర్, బుక్కీగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. కేవలం అతనితో ఉన్న పరిచయంతో.. ఆయన పిలవడం వల్లనే ఆ పార్టీకి వెళ్ళా అంటూ వివరించింది. కేవలం బర్త్డే పార్టీ అని అక్కడికి వెళ్ళా.. కానీ అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు. పోలీసులు వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నా.. బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చా అంటూ వివరించింది. అక్కడ నటి హేమను తను చూడలేదని.. లోపల ఏం చేస్తున్నారు నాకు తెలియదు అంటూ వివరించింది. కొకేయిన్, మొత్తు పదార్థాలు దొరకడం గురించి నాకు ఏమీ తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.