వాట్.. బాలయ్య – అమితాబ్ కాంబోలో ఓ సినిమా మిస్సయిందా.. డీటెయిల్స్ ఇవే..?!

సినీ ఇండస్ట్రీలో చాలా సందర్భాల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు ఫిక్స్ అయ్యి ఏవో కారణాలతో ఆగిపోతూ ఉంటాయి. ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూసినా ఆ క్రేజీ కాంబినేషన్‌తో నిరాశ చెందిన సందర్భాలు ఉన్నాయి. అలా బాలకృష్ణ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబచ్చన్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిన తర్వాత పట్టాలెక్కకముందే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో సెట్స్ పైకి రాకుండానే ఆగిపోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. గతంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాల ఆధారంగా ఒక కథను తయారు చేసి తెరకెక్కించాలని ప్లాన్ చేశారట మేకర్స్. అయితే ఈ కథకు రైతు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

BA Raju's Team on X: "Nandamuri Balakrishna with Krishna Vamsy at Ram Gopal  Varma, Amitabh Bachchan's #Sarkar3 sets https://t.co/7gxA7QpHtj" / X

ఈ కథను బాలకృష్ణకు వినిపించగా స్టోరీ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. 2012లో తన 100వ‌ సినిమాగా ఈ సినిమాను చేసేందుకు ఆయన ప్లాన్ చేశాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు కృష్ణవంశీకి అప్పగించాడు. అయితే కథలో ఒక కీలక పాత్ర కోసం అమితాబచ్చన్ ని కూడా కలిశారట. అమితాబచ్చన్ కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన పాత్రని న‌డివి పెంచేందుకు కథలో కాస్త మార్పులు కూడా చేసి స్క్రిప్ట్‌ ను రెడీ చేసాడట కృష్ణవంశీ. కాగా అదే టైంలో క్రిష్ బాలయ్య‌కు గౌతమీపుత్ర శాతకర్ణి స్క్రిప్ట్ చెప్పడం.. ఆ కథ బాగా నచ్చడంతో క్రిష్ ఆ కథనే 100వ సినిమాగా తెరకెక్కించారు. దీంతో రైతు సినిమా పట్టాలెక్కలేదు.

Balakrishna About His Next Movie With Krishna Vamsi | Amitabh Bachchan |  Raithu | TFPC

అయితే తర్వాత కూడా మళ్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారని అయితే అది వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. ఈ సినిమా ఆగిపోవడానికి గల అసలు కారణమేంటో తెలియదు కానీ.. బాలకృష్ణ కూడా తర్వాత రైతు కాన్సెప్ట్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో బాలకృష్ణ, అమితాబ్‌ల‌ క్రేజీ కాంబినేషన్ సినిమాను మిస్ అయిపోయారు ప్రేక్షకులు. అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో, అమితాబ్‌ సినిమా సెట్స్‌పైకి వచ్చింది. చిరు ప్రధాన పాత్ర పోషించిన సైరా నరసింహారెడ్డి సినిమాల్లో బిగ్‌బి కీల‌క‌పాత్ర‌లో మెప్పించారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ ఆక‌ట్టుకున్నాడు.