నిన్న మొన్నటి వరకు ఏపీ పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్నికలు పూర్తయిన క్రమంలో సినిమాలు పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పవన్.. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓజీ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నెలాఖరుకు మూవీ సెట్స్ లో పవన్ జాయిన్ అవుతున్నాడు అంటూ తెలుస్తుంది. జులై చివరాఖరి కల్లా తన పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసేలా ఆయన ప్లాన్ చేసుకున్నాడట.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓజీ ఇస్ బ్యాక్ అనే ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడు. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్, హష్మీ అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొల్పాయి. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు.
పవన్ నటించిన అత్తారింటికి దారేది పదేళ్ల క్రితం సెప్టెంబర్ 27న రిలీజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే డేట్కు ఓజి వస్తుండడంతో ఈ సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ పక్క అంటూ పవన్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ ఈ సినిమాతో పాటు హారిహర విరమల్లు సినిమా కూడా లైన్లో ఉంచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు కూడా తన డేట్స్ ఇచ్చి పోర్షన్ పూర్తి చేశాయలనే ప్లాన్లో ఉన్నాడట పవన్.