“నన్ను మోసం చేశారు”..ఎన్టీఆర్ సినిమా పై హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

తెలుగు అమ్మాయిలకి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువగా ఇస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే దానికి రీజన్ మాత్రం ఎవ్వరికి తెలియదు . సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలు ఉన్నారు . కానీ పెద్ద పెద్ద సినిమాలో మాత్రం పక్క భాష ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటూ ఉంటారు . ఈ విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో హీరోయిన్ ఈషా రెబ్బా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పేరుకు తెలుగు అమ్మాయి అయినా పెద్దగా పాపులారిటి దక్కించుకోలేకపోయిన ఈషారెబ్బ.. కొన్నికొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది ఈషా రెబ్బ . ఈ క్రమంలోనే అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసినందుకు నేను హ్యాపీగా లేను అంటూ సంచలన ప్రకటన చేసింది . ఆమె మాట్లాడుతూ..” మొదట ఈ సినిమాలో నన్ను చేయమన్నప్పుడు నేను ఒప్పుకోలేదు .. ఎందుకంటే నేను లీడ్ క్యారెక్టర్స్ చేద్దాం అనుకున్నాను. నాకు సెకండ్ హీరోయిన్ అని చెప్పారు .. అప్పుడు కూడా నో చెప్పాను .. సెకండ్ లీడ్ అని చెప్పడంతోనే ఓకే చేశాను .. కరెక్ట్ గా సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ఒక్కరోజు ముందు ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేశాను “..

“అయితే సినిమాలో నా సీన్స్ చాలా చాలా ఎడిటింగ్ లో లేపేసారు.. నాతో ఎన్టీఆర్ తో ఒక సాంగ్ ఉంటుంది అన్నారు.. అది క్యాన్సిల్ చేసేసారు .. అంతేకాదు ఈ సినిమాలో నటించిన తర్వాత చాలామంది నన్ను అడిగారు… నువ్వు ఎందుకు ఈ సినిమా చేసావు ..నీది బిస్కెట్ క్యారెక్టర్ అయింది కదా అని .. వాళ్ళకి నేను ఏమి సమాధానం చెప్పుకోలేకపోయాను.. ఈ సినిమాలో నటించిన కారణంగా నాకున్న హ్యాపీనెస్ ఒక్కటే తారక్ – త్రివిక్రమ్ గార్లతో వర్క్ చేయడం .. అది తప్పిస్తే నాకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు ..అయితే తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ.. అని జనాలకు అర్థమైంది.. అదొక్కటే అంటూ ఈషా రెబ్బ సంచలన కామెంట్స్ చేసింది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!