తిన్న ఆహారం సరిగా జీర్ణం అవడం లేదా?.. అయితే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..!

ఈ కాలంలో తినే ఆహారం వల్ల సరిగ్గా జీర్ణం కావటం లేదు. తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ప్రోబ్రయోటిక్స్ ఎక్కువగా ఉంటే వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ, ఉప్పు కారం లేని పచ్చి మామిడికాయ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

జీర్ణ ఎంజైములు ఉండే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఇది ఎక్కువగా అల్లం,పసుపు, జీలకర్ర వంటివి వాటిల్లో ఉంటాయి.ఇక తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే జీలకర్రను నీటిలో కలుపుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు.రాత్రంతా నాన్న పెట్టి తాగితే మరింత లాభం.

భోజనం చేసే అరగంట ముందు అల్లం రసం తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దీనితో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.ఇక తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలంటే కచ్చితంగా తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 3 లీటర్లు నీరు తాగాలని చెబుతున్నారు.భోజనం చేసిన తర్వాత పుదీనా ఆకులు నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.