సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులరిటీ దక్కించుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకటి. నిన్న మొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్తో గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమా కోసం అనుపమ బోర్డర్స్ దాటి మరి బోల్డ్ కంటెంట్లో నటించిన సంగతి తాజా టీజర్ ద్వారా అర్థమవుతుంది. గతంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించడంతో.. ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందించారు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటివరకు అనుపమ ఎన్నో సినిమాల్లో నటించినా.. ఈ సినిమాల్లో నటించినంత బోల్డ్.. రొమాంటిక్ సన్నివేశాలు ఎప్పుడు కనిపించలేదు. ఇక టిల్లు స్క్వేర్లో నటుడు సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఈమె భారీ లెవెల్ లో రొమాన్స్ చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ లో అనుపమ.. కార్లో సిద్దుతో కలిసి ఘాటు లిప్ లాక్ సన్నివేశాల్లో కనిపిస్తోంది. దీనిపై తాజాగా ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అనుపమ మాట్లాడుతూ రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదు. చుట్టూ 100 మంది ఉంటే అందరి ముందు మేమిద్దరం రొమాన్స్ చేయడం అంటే అది చాలా కష్టంగా అనిపించేది.
ప్రతి ఒక్కరూ కూడా కార్ సీన్ గురించి అడుగుతున్నారు. ఆ సీన్ చేయడానికి నేను చాలా కష్టపడ్డా. ఆ కష్టం నాకు మాత్రమే తెలుసు. చుట్టూ వందమంది గుంపుగా ఉంటే.. కార్లో మేమిద్దరం రొమాన్స్ చేసుకోవడం చాలా కష్టం. ఆ టైంలో తన మోకాలికి బాగా గాయం అయిందని.. ఆ బాధను భరిస్తూ బయటకు మాత్రం రొమాంటిక్ ఫీల్ చూపిస్తూ నటించానని.. అది అంతే సులభం కాదని వివరించింది. అలాంటి పరిస్థితుల్లో రొమాన్స్ చేయడం కష్టతరంగా అనిపించినా కథకు అవసరం కాబట్టి చేశానని ఆమె కామెంట్స్ చేసింది. ఇక ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో అనుపమ చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి.