సౌత్ స్టార్ హీరోగా మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమాల్లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా వరద రాజ మన్నార్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్కు టాలీవుడ్లోనూ భారీ లెవెల్లో క్రేజ్ పెరిగింది. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్, పృధ్వీరాజ్.. నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక ఇప్పటికే పృధ్విరాజ్.. ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళం లో ఆడు జీవితం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూవర్ మీరు.. ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ కదా.. మీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ని తీసుకువస్తే సరిపోయేదిగా అంటూ ప్రశ్నించాడు.
దీనికి పృధ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ.. నేను అడిగితే ప్రభాస్ కచ్చితంగా వస్తారు. నాకు నో చెప్పరు. చెప్పలేడు. అలా నో చెప్పలేని వారిని ఎప్పుడూ మనం సహాయం అడగకూడదు అంటూ వివరించాడు. అలా నో చెప్పలేని వారిని సహాయం అడగడం మనదే తప్పు అవుతుందని పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ నిటింట వైరల్ గా మారాయి. ఇక ఈయన గతంలో ప్రభాస్ గొప్పదనం గురించి తనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే విషయాలను గురించి పలు ఇంటర్వ్యూలో వివరించిన సంగతి తెలిసింది.