ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండే సాయి పల్లవి కుమిలి కుమిలి ఏడుస్తుందా..? అంటే అవుననే అంటుంది సినీ వర్గం . దానికి కారణం లేకపోనూ లేదు . సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని అందరూ అంటుంటారు . బహుశా సాయి పల్లవికి ఇప్పుడు అర్థమైనట్లు ఉంది . ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ . కొందరు స్టార్ హీరో సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది.
అయినా సరే ఆమెకు హ్యూజ్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకునే సాయి పల్లవి ఒక సినిమా విషయంలో మాత్రం బోల్తా కొట్టింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా రాముడు పాత్రలో రన్బీర్ కపూర్ .. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి లను చూస్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.
ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ కూడా అయిపోయింది . రేపో మాపో అఫీషియల్ ప్రకటన అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే రాత్రికి రాత్రి ఈ ప్రాజెక్ట్ చేతులు మారిపోయింది. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి కాకుండా హీరోయిన్గా జాన్వి కపూర్ ను తీసుకున్నారట బాలీవుడ్ మేకర్స్. ఆమెకున్న పలుకుబడి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కారణంగానే సాయి పల్లవిని తీసేసి జాన్వి కపూర్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు ఓ వార్త ట్రెండ్ అవుతుంది. చాలా ఇష్టంగా ఒప్పుకున్న ప్రాజెక్ట్ నుంచి ఆమెను తీసేయడంతో సాయి పల్లవి కుమిలి కుమిలి ఏడుస్తుందట . దారుణంగా ముంచేశారు అంటూ బాధపడిపోతుందట..!!