బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన గొడవల కారణంగా పల్లవి ప్రశాంత్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికే తోటి కంటెస్టెంట్ అయిన బోలే షావలి, అశ్వినితో పాటు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కూడా స్పందించాడు. అతని తప్పు ఏమీలేదని అభిమానులను కలవాలని ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాడు అంటూ ప్రశాంత్ ను రిలీజ్ చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే హౌస్ లో ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన శివాజీ మాత్రం పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించకపోవడంతో ఇప్పటివరకు అతనిపై పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఎట్టకేలకు శివాజీ ఈ న్యూస్ పై స్పందించాడు. చాలామంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి ప్రశాంత్ గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటే.. ప్రశాంత్ కి ఏమీ కాదు.. చట్ట ప్రకారం వాడు బయటకి వస్తాడు. తను ఎక్కడికి పారిపోలేదు.. పారిపోయారు అంటూ పిచ్చిపిచ్చి థంబ్ నైల్స్ పెట్టారు.. నాలుగు నెలల నుంచి ప్రశాంత్ ని చూస్తున్న వాడు చాలా మంచి అబ్బాయి.
గెలిచాను అనే ఆనందం ఒక్కోసారి మనిషిని డామినేట్ చేయడం కామన్. నేను అందర్నీ కలవాలి, నాకోసం వచ్చిన వాళ్ళందరినీ నేను చూడాలి.. అని ఎలాంటి వారైనా భావిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ర్యాలీలో ప్రశాంత్ పాల్గొన్నారు. తన హౌస్ లో నుంచి బయటకు రాకముందే కొంతమంది కార్లు పగలగొట్టారు. అది చాలా బాధాకరం. అయితే అభిమానులైనా లేదా అభిమానుల ముసుగులో ఎవరు చేసినా ఇది చాలా తప్పు. ఆ కారులో తమ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. వాళ్లు కూడా చాలా బాధపడతారు.
బాధపడడం కూడా కాదు ఆ టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు. ఇలాంటివన్నీ చాలా తప్పు.. అది ఎవరైనా సరే అభిమానులైనా కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు.. దాన్ని నేను ఖండిస్తున్న. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేను ప్రశాంత్ గురించి పదేపదే మాట్లాడను.. వాడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఏం జరిగిందో మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది.. నేను ఎవరు ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. ప్రశాంత్ త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తాడు అంటూ శివాజీ వివరించాడు. ప్రస్తుతం శివాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.