యానిమల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్యారెక్టర్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది . ఏ క్యారెక్టర్ ని కూడా అల్లాటప్పగా డమ్మీగా క్రియేట్ చేయలేదు సందీప్ రెడ్డివంగా. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డివంగా ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా నే ఈ యానిమల్. ఈ సినిమా దాదాపు 770 కోట్లు కలెక్ట్ చేసింది.
త్వరలోనే 1000 కోట్లు కూడా ఫినిష్ చేసుకోబోతుంది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు . కాగా యానిమల్ సినిమాలో నర్స్ పాత్రలో కనిపించిన ఈమెకు స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది . దానికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . ఈమె పేరు దీప్తి పటేల్ . పంజాబీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి .
టీవీ షోస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకునింది . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది . సందీప్ రెడ్డివంగాకు ఈమెలో మెయిన్ గా నచ్చింది ఎటువంటి సీన్ చెప్పిన సరే కాదు నో అని కాకుండా సింగిల్ టేక్ లోనే ఓకే చేసేస్తుందట . అందుకే సందీప్ మెచ్చి మరి ఈమెను సినిమాలో పెట్టుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!