మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోలకు ఓ తేదీ అస్సలు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నాడు. అలాగే సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కిన `పుష్ప` చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక రామ్ చరణ్ నటించిన `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ, కరోనా కారణంగా ఈ మూడు చిత్రాలు వాయిదా పడ్డాయి. ఆచార్య వచ్చే ఏడాది జూన్ 4కి షిఫ్ట్ అవ్వగా.. పుష్ప రాబోయే డిసెంబర్ 17న విడుదల కానుంది. అలాగే ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా 2022, జనవరి 7న బరిలోకి దిగబోతోంది. అయితే 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మెగా హీరోల సినిమాలన్నీ వాయిదా పడటంతో.. వారికి ఆ తేదీ కలిసి రాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.