సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడక నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తారలు ఈ అవార్డ్ ఫంక్షన్లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం `అల వైకుంఠపురములో` హవా చూపించింది.
ఇప్పటికే ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం సైమాలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుంది. సైమాలో ఉత్తమ చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ అవార్డు గెలుచుకుంది. అలాగే ఈ సినిమాకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, త్రివిక్రమ్ ఉత్తమ దర్శకుడిగా, తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, పూజా హెగ్డే ఉత్తమ నటిగా, మురళీ శర్మ ఉత్తమ సహాయ నటుడిగా, టబు ఉత్తమ సహాయ నటిగా, సముద్ర ఖని ఉత్తమ విలన్గా, రామజోగయ్యశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా (బుట్టబొమ్మా), అర్మాన్ మాలిక్ ఉత్తమ గాయకుడి (బుట్టబొమ్మా)గా అవార్డును అందుకున్నారు.
పది అవార్డులు రావడంతో అల.. టీమ్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక 2020లో `అల వైకుంఠపురములో` చిత్రానికి పోటీగా విడుదలైన మహేష్బాబు `సరిలేరు నీకెవ్వరు` కేవలం రెండు అవార్డులనే దక్కించుకుంది. `ఉత్తమ గాయని`గా మధుప్రియ(హి ఈజ్ సో క్యూట్), ఉత్తమ సినిమాటోగ్రఫీగా ఆర్ రత్నవేలు అవార్డులను సొంతం చేసుకున్నారు.
The best movies are made when the best talent comes together. Ala Vaikunthapurramuloo proved just that.@alluarjun @trivikramIn @hegdepooja @murlisharma72 @thondankani @iamSushanthA @Nivetha_Tweets @padmasoorya @MusicThaman #SIIMA2020#SIIMA2021#SIIMAONREELS pic.twitter.com/9bJ7mxHkOn
— SIIMA (@siima) September 19, 2021