ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మధ్య వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్తో ఇబ్బంది పడ్డ శంకర్.. ఆ తర్వాత అపరిచితుడు రీమేక్ వివాదంతో సతమతమయ్యాడు. ఇక ఇప్పుడు చరణ్ సినిమా సైతం చిక్కుల్లో పడింది.
శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించబోయే ఈ చిత్రం కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఇలాంటి తరుణంలో రామ్చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు అనే రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. చెల్లముత్తు .. కార్తీక్ దగ్గర దర్శకత్వ శాఖాలో పని చేశారు. నా కథని కార్తీక్ కాపీ కొట్టి శంకర్కు ఇచ్చాడని చెల్లముత్తు ఆరోపిస్తున్నారు. దాంతో ఇప్పుడీ ఆంశం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.