సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుము శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుందీ చిత్రం.
అయితే తాజాగా ఈ సినిమాను తన ఇంట్లోని మినీ థియేటర్లో వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `శ్రీదేవిసోడా సెంటర్ … కష్టమైన క్లైమాక్స్ తో ముడి పెట్టిన సీరియస్ మూవీ. దర్శకుడు కరుణకుమార్ పలాస 1978 తర్వాత మరో బోల్డ్ సినిమాతో ముందుకు వచ్చారు. సుధీర్ ఎంపిక చేసుకున్న చిత్రాల్లో ది బెస్ట్ మూవీ ఇది.
అలాగే నటన పరంగానూ సుధీర్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇక ఆనంది ఎంతో కరెక్ట్ గా సెట్ అయింది. అద్భుతమైన విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. మొత్తానికి మహేష్ రివ్యూ చూస్తుంటే.. ఆయనకు సినిమా బాగా నచ్చినట్టు స్పష్టంగా అర్థమైంది. కాగా, మరికొందరు సినీ ప్రముఖులు కూడా శ్రీదేవి సోడా సెంటర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.