రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే సూర్య ఒప్పుకున్నాడా..?

హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో కార్తీ ని విభిన్నమైన కథతో చూపించాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజన్.ఖైదీ సినిమానే కాకుండా అంతకుముందు సందీప్ కిషన్ తో నగరం అనే సినిమాను ఇవ్వడం జరిగింది. ఆ సినిమా ఖైదీ అంత హిట్ ను ఇవ్వకపోయినా ఒక మోస్తరు లోనే ఆడింది.అయితే ఖైదీ తర్వాత ఇతను విజయ్ తో మాస్టర్ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలిసి ఇ ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారట.అంతేకాకుండా ఈ సినిమాకు విలన్ గా విజయ్ సేతుపతి ని తీసుకోవడం వల్ల మాస్టర్ సినిమా పై అప్పటివరకు ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లాయనే చెప్పాలి.

దాంతో కొంత మంది హీరోలు ఆయనతోనే సినిమా తీయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు.ముఖ్యంగా రామ్ చరణ్ రవితేజ లాంటి పెద్ద హీరోలు ఆయనతో సినిమా తీయటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారట.

బాలీవుడ్ స్టార్లే కాకుండా టాలీవుడ్ స్టార్లు కూడా లోకేష్ తో మూవీ తీయాలని ఆశ పడుతున్నారట.ఈ దశలో రామ్ చరణ్ కు ఒక కథ కూడా వినిపించాడులోకేష్. ఆ కథ రామ్ చరణ్ కి నచ్చిందట కానీ మాస్టర్ టాక్ చూశాక చరణ్ తన మనసు మార్చుకున్నాడు.లోకేష్ తో సినిమా చేయాలని ఆలోచనలు రామ్ చరణ్ విరమించుకున్నాడు.

ఆ సినిమాని రామ్ చరణ్ వదులు కోవడం వలన ఆ కథనే హీరో సూర్యకి కథ చెప్తే ఓకే అన్నాడట.లోకేష్ సూర్య ఈ ప్రాజెక్టు చేయటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపుతున్నాడట ఈ చిత్రాన్ని నిర్వహిస్తున్న వారు రైన్ ఆన్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా త్వరలో అధికార ప్రకటన రానుంది.