ఆ మెగా హీరోతో సినిమా తీసి కోట్లు నష్టపోయిన నిర్మాత?

పీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ ఓనర్ అయిన సీ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థలో 2017 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా లోఫర్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని నటించింది.ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేశాను అని, కానీ ఈ సినిమా ఆశించిన విధంగా ఫలితాలను ఇవ్వలేకపోయింది అని తెలిపారు.

అలాగే ఈ సినిమా వల్ల దాదాపుగా 7 కోట్లు నష్ట పోయానని కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే తనకు నష్టం వచ్చిందని ఎప్పుడూ కూడా ఏ హీరో దగ్గరికి వెళ్లి తన తర్వాత సినిమా చేయాలని తాను అడగలేదని కళ్యాణ్ తెలిపారు. అయితే హీరో వరుణ్ తేజ్ తో మరొక సినిమా తీయడానికి ఆలోచనలు ఉన్నాయని, కాకపోతే సరైన కథ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.