టాలీవుడ్ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్.. తొలినోళ్లల్లో చెన్నైలో గడిపేవారు. అయిన తన సినిమాలను తెలుగుతో పాటు తమిళ్లోను రిలీజ్ చేసి స్టార్డం సంపాదించుకున్నారు. అప్పటి స్టార్ హీరోలంతా తమ సినిమాలు తమిళ్, తెలుగు రెండు భాషల్లో విడుదల చేసి పాపులర్ అయిన వారే. అయితే కొన్నళకు సడన్గా చెన్నై నుంచి మక్కాం మార్చేసి హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయాడు అక్కినేని. చాలామంది ఆ టైంలో అందరూ టాలీవుడ్ హైదరాబాద్కి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కినేని కూడా అక్కడికి వెళ్లిపోయారని భావించారు. కానీ.. అసలు విషయం అది కాదట. ఆయన చెన్నై వదిలి హైదరాబాద్కు వచ్చేయడానికి వెనుక ఓ స్టార్ హీరో ఉన్నాడన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఎవరా హీరో.. చెన్నై వదిలిపెట్టి ఏఎన్ఆర్ అంత సడన్గా హైదరాబాద్కు ఎందుకు రావాల్సి వచ్చిందో.. ఒకసారి తెలుసుకుందాం. ఏఎన్ఆర్ అప్పటికే తెలుగులో నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో.. కమల్హసన్ ఒకసారి ఏఎన్ఆర్ను కలిశారట. అప్పటికే ఎన్టీఆర్తో పోటీపడి మరి ఓ స్టూడియోను కట్టి ఏఎన్ఆర్ బాగా సెటిలైపోయారు. కానీ ఎందుకో తమిళ్ సినిమాలను ఆయన తెరకెక్కించడం మానేశారు. ఈ ఈ విషయంలో కుతూహలాన్ని ఆపుకోలేక కమలహాసన్ మీరు ఇంత పెద్ద స్టార్ హీరో కదా.. మంచి సక్సెస్లు అందుకుంటున్నారు. మరి ఎందుకు తమిళంలో సినిమాలను చేయడం ఆపేశారని ప్రశ్నించాడట.
దానికి ఏఎన్ఆర్ మాట్లాడుతూ.. అక్కడ ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్ కారణంగా నేను హైదరాబాద్కి వచ్చేసానంటూ వివరించాడట. ఇంతకి ఆ తుఫాన్ ఎవరోకాదు తమిళ్ స్టార్ హీరో శివాజీ గణేషన్. అప్పట్లో ఆయన సినిమాలకు పూర్తిగా డిమాండ్ ఉండడంతో.. అక్కినేని సినిమాలు వరుసగా ఫ్లాప్లుగా నిలిచాయి. ఈ క్రమంలో ఆయన సినిమాలకు అక్కడ డిమాండ్ తగ్గిందని తెలుసుకుని.. ఏఎన్ఆర్ కేవలం తెలుగు సినిమాలను మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యాడట. నిజానికి అక్కినేని, శివాజీ గణేషన్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్యన అరె.. ఒరే.. అనుకునేంత చనువు ఉందట. అయినా సినిమా అనేది తమ కెరీర్ కావడంతో.. ఎలాగైనా తన కెరీర్ కాపాడుకోవాలని ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసాడట ఏఎన్ఆర్.