టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్తో దూసుకుపోతున్నాడు. మధ్యలో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. టాలీవుడ్ లో ఆయన మార్కెట్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. రీ ఎంట్రీతో మరోసారి వెండి తెరపై తన సత్తా చాటుతున్నాడు చిరంజీవి. ఏడు పదుల వయసు మీద పడుతున్నా తరగని ఎనర్జీ.. యంగ్ లుక్తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం మల్లీడి వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ విశ్వంభరా సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ జానెర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
దాదాపు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరుజంటగా సీనియర్ బ్యూటీ త్రిష ప్రేక్షకులను మెప్పించనుంది. ఇక మీనాక్షి చౌదరి, సురభి, వెన్నెల కిషోర్, మృణాల్ ఠాగూర్, శ్రీ విష్ణు, ఇషా చావ్లా, రావు రమేష్, అశికా రంగనాథన్, కునాల్ కపూర్, నభానటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక మెగాస్టార్ సినిమా అంటే ఆడియన్స్ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటుంటారు. ఈ క్రమంలో సినిమాలో ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారట మేకర్స్. ఈ స్పెషల్ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ సెలెక్ట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్ నటి వారసురాలు శృతిహాసన్. గతంలో శృతి చేసిన ఓ ఐటెం సాంగ్ కుర్రకారులో హీట్ను పెంచేసింది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా నటిస్తూనే.. మరో పక్కన స్పెషల్ సాంగ్స్లోను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం గురించి విశ్వంభర టీం శృతిహాసన్ సంప్రదించారని.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమైతే మెగా ఫ్యాన్స్ను తట్టుకోవడం కష్టమే.