ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ రకుల్ అభిమానులకు ఫుల్ జోష్ని ఇస్తుంది . అసలు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలను పట్టించుకోవడమే మానేసింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు సినిమాల ముఖం కూడా చూడడం లేదు . పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రలో నటిస్తూ వచ్చింది. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భర్తతో హనీమూన్ కూడా బాగా ఎంజాయ్ చేసింది.
కాగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే ఓ తెలుగు సినిమాతో మళ్లీ రి ఎంట్రీ ఇవ్వబోతుందట. సామజ వర గమన సినిమాకు రచయితగా వర్క్ చేసిన భాను బొగ్గవరపు డైరెక్టర్ గా మారుతూ రవితేజతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే జరిగాయి .
ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఈ సినిమాలో సెకండ్ లీడ్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందట . అంతేకాదు ఈ సినిమాలో ఆమె చాలా చాలా టఫ్ ఉన్న రోల్ లో నటించబోతున్నట్లు కూడా తెలుస్తుంది . రవితేజ మాస్ క్యారెక్టర్ కు జోడిగా నటించబోతుందట . రవితేజ రకుల్ ప్రీత్ సింగ్ భార్యాభర్తలు గా కనిపించబోతున్నారట . ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ సంబరపడిపోతున్నారు ..ఫైనల్లి ఒక్క తెలుగు సినిమా కైనా సైన్ చేసావ్ ఆనందం అంటూ పొగిడేస్తున్నారు..!!