టాలీవుడ్లో క్లాసిక్ డైరెక్టర్గా సురేందర్ రెడ్డికి తెలుగు ఆడియన్స్లో పరిచయం అవసరం లేదు. రవితేజ ‘కిక్స సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించాడు. ఇక మహేశ్ బాబుతో అతిథి సినిమాను తెరకెక్కించగా అది ఊహించిన సక్సస్ అందుకోలేక పోయింది. అయినా ఇప్పటికి ఈ సినిమాలో కొన్ని పాత్రలు మాత్రం ఆడియెన్స్కు ఎప్పటికీ గుర్తుంటాయి. అలాంటి పాత్రల్లో హీరోయిన్ చెల్లెలు పాత్ర కూడా ఒకటి.
ఇంతకి ఆ పాత్ర పోషించిన అమ్మడి పేరు చెప్పలేదు కదా.. తనే కర్మన్ సింధు. అతిథి మూవీ తన మొదటి సినిమా అయినా.. కెమెరా ఫియర్ అన్నదే లేకుండా తన నటనతో అదరగొట్టింది. ఈ అమ్మడి నటనకు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందాయి. అన్ని రకాల ఎమోషన్స్ను సక్సస్ ఫుల్గా పండించి నటిగా తన సత్తా చాటింది. క్లైమాక్స్లో ఈ ముద్దుగుమ్మ పాత్ర చనిపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ఇది కూడా సినిమా ఫ్లాప్కు ఒ కారఫనం అనడంలో అతి శయోక్తి లేదు. తెలుగు ల్లో శాడ్ ఎండింగ్ ఉండే ప్రేక్షకులు ఆ సినిమాను యాక్సప్ట్ చేయలేరు.
అయినా సురేంద్రరెడ్డి ఆ రిస్క్ చేసి మూవీ తీశాడు. కాగా అది ఫ్లాప్గా నిలిచింది. ఇక అతిథి తర్వాత సింధు మరే సినిమాలోను నటించలేదు. కారణం ఆమెకు ఇండస్ట్రీపై అశక్తి లేకపోవటమే. అయితే ఇప్పుడు ఈ సింధు ఏం చేస్తుంది.. ఎలా ఉంది అని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది ఆ విషయాలేంటో ఓ సారి తెలుసుకుందాం. కర్మన్ సింధు ప్రస్తుతం కెరీర్ కౌన్సెలింగ్, గైడెన్స్, అసెస్మెంట్లో కాన్సిలర్గా వ్యవహరిస్తూ సమాజానికి సేవలందిస్తుంది. ఇక ఆ ఆమ్మడు లేటిస్ట్ ఫోటో ఒకటి నెటింట తెగ ట్రెండ్ అవుతుంది మీరు ఓ లుక్ వేసేయండి.