ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ సార్గా క్రేజ్ సంపాదించుకుని.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో లైన్లో పెట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా పూర్తి కాగానే చరణ్, బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్ సి 16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు ఇటీవల గ్రాండ్ లెవెల్ లో జరిగాయి.
ఇక రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో వృద్ధి శ్రీనివాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్.. చరణ్కు జోడిగా నటించింది. శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా మదర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందుతున్నట్లు.. దానికోసం చరణ్ తల్లి పాత్రలో సీనియర్ స్టార్ బ్యూటీని తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఆమెవరో కాదు పవర్ఫుల్ లేడీ విజయశాంతి. ఇందులో భాగంగానే విజయశాంతిని కలిసి కథను వినిపించనున్నట్లు.. ఈమెకు కథ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రామ్ చరణ్ తల్లిగా విజయశాంతి నటించబోతుందని వార్తలు వరలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ తల్లిగా విజయశాంతి నా అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. వీరిద్దరికి కాంబోలో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.