స్టార్ నటుడు శరత్ కుమార్ నటవరసరాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. మొదట తమిళ్లో హీరోయిన్గా రాణించిన ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటిస్తూ మెప్పించింది. తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈమె ఒక సినిమాలో నటించింది అంటే కచ్చితంగా ఆ సినిమాలో కంటెంట్ బలంగా ఉంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఈ క్రమంలో వరలక్ష్మికి వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఓ పక్కన సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతూనే మరోపక్క నికోలాయ్ అనే గ్యాలరిస్ట్ తో ప్రేమలో పడింది ఈ అమ్మడు.
నిన్న మొన్నటి వరకు పలు టాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొని.. పెళ్లిపై అసలు ఆసక్తి లేదంటే చెప్పిన ఈ అమ్మడు ఒక్కసారిగా నెకోలాయ్ను ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్కు షాక్ ఇచ్చింది. అస్సలు ఎవరు గెస్ చేయని విధంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో నికోలాయి.. వరలక్ష్మికి ఓ మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ తో షాక్ ఇచ్చాడని తెలుస్తుంది. వరలక్ష్మి కోసం ముంబైలో ఏకంగా రెండు విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేశాడట. రెండు బంగ్లాలలోనూ అన్ని సౌకర్యాలు ఉండేలాగా చూసుకున్నారని.. ఈ బంగ్లాల ఖరీదు కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తుంది.
ఇక వరలక్ష్మి సినిమాల విషయాన్ని చూస్తే ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాగా శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహర్షి కూండ్ల సమర్పణలో.. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్లా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. పలువురు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కాట్ట్ దర్శకుడుగా వ్యవహరించాడు. నేడు ఈ సినిమా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. థ్రిల్లర్ స్టోరీనీ ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనే టాక్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం పెళ్లి ఎప్పుడు అనే అంశంపై ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఎంగేజ్మెంట్ జరిగింది కదా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వివరించింది వరలక్ష్మి.