సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫొటోస్ మార్ఫ్ చేయడం.. ఫేక్ ఫోటోలను ట్రెండ్ చేయడం చాలా చాలా కామన్ గా చూస్తున్నాం . చాలా వరకు డబ్బున్న స్టార్ పిల్లలు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలకు సంబంధించిన ఫోటోలను విచ్చలవిడిగా వల్గర్ గా చెత్త చెత్తగా వైరల్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఎవరైతే సోషల్ మీడియాలో కొంచెం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసే హీరోయిన్స్ ఉన్నారో.. వాళ్ళ ఫొటోస్ ని పోర్న్ సైట్స్ లో పెట్టి దారుణాతి దారుణంగా అవమానిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
కాగా అదే విషయంపై రెస్పాండ్ అయింది హీరోయిన్ జాన్వి కపూర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురే ఈ జాన్వి కపూర్. ఇప్పుడు ఒక క్రేజీ హీరోయిన్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ సంచలన విషయాన్ని బయటపెట్టింది . జాన్వి రాజ్ కుమార్ రావు నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే చిత్రం ఈ నెలాఖరుకు రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు జాన్వీ.
ఆ ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ సంచలన కామెంట్స్ చేసింది . “నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నా ఫొటోస్ పోర్న్ సైట్లో చూశాను .. చాలా చాలా బాధనిపించింది.. ఎందుకు నా ఫొటోస్ పై అలాంటి కామెంట్స్ చేశారో అర్థం కాలేదు ..బూతులు మాట్లాడారు .. నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు నన్ను అవహేళనగా చూశారు .. దారుణాతి దారుణంగా ఇన్స్టాల్ చేశారు .. అసలు ఆ వయసులో వాటి గురించి నాకు అవగాహన లేదు ఎందుకు ఎగతాళి చేస్తున్నారో .. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారో కూడా అర్థమయ్యేది కాదు .. అలా చేస్తే వాళ్లకు ఏం వస్తుంది అనేది కూడా ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు.. నా కుటుంబమే నా వీక్నెస్ అందుకే ..నేను నా కుటుంబంతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకొని నా బాధను పంచుకుంటాను.. నా తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న కారణంగానే ఆ టైంలో ఆ ట్రోలింగ్ నుంచి ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాను” అంటూ సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన్ జాన్వి కపూర్..!!