దానికి ఇదే నా చివరి వీడ్కోలు.. నిహారిక సంచలన పోస్ట్..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేక పోయిన వారిలో నిహారిక కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ మొదట్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ హీరోయిన్గా తనకి పెద్దగా కలిసి రాలేదు. దీంతో అనంతరం పెళ్లి బంధం లోకి అడుగుపెట్టింది. పోనీ ఆ బంధంలో అయినా కలకాలం కొనసాగుతుంది అనుకుంటే అది జరగలేదు.

పెళ్లయి ఏడాది తిరక్కముందే విడాకులు అనే దారిని ఎంచుకుని మరోసారి మెగా ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఓ నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాణంలో అయినా మంచి గుర్తింపును సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ డోస్ కూడా పెంచింది ఈ ముద్దుగుమ్మ. ఇక నిహారిక తాజాగా ఆహాలో ఓ షోకి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆహా పై నిహారిక కొన్ని కామెంట్స్ చేసింది. నిహారిక ఇటీవల ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం అయిన ఆహా వేదికగా ” చెఫ్ మంత్ర సీజన్ 3 ” కి హౌస్ట్ గా వ్యవహరిస్తుంది.

ఈ సీజన్ కొంచెం డబల్ మీనింగ్ డైలాగ్లతో నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ ఆరవ ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఫేమస్ సింగర్స్ హేమచంద్ర, రాహుల్ సిప్లిగంజ్ గెస్ట్లుగా హాజరయ్యారు. ఇక పెద్దపులి సాంగ్ ఇద్దరు సింగర్స్ తో పాటు నిహారిక కలిసి స్టెప్పులు వేసింది. దీంతో రాహుల్ ఈ సాంగ్ నిహారికతో పాడించాలి అనగా.. దానికి నిహారిక..” అప్పుడు ఆహా కు ఇదే లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది ” అంటూ నవ్వించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.