రామాయణం కోసం కసరత్తులు మొదలుపెట్టిన గురూజీ.. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తావా అంటూ కామెంట్స్..!

ప్రస్తుత కాలంలో టాలీవుడ్ మరియు బాలీవుడ్ అనే విభేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలను కలగలిపి కొడుతున్నారు దర్శకులు. మన తెలుగు దర్శకులు ఇతర ఇండస్ట్రీలోకి వెళుతుంటే ఇతర ఇండస్ట్రీల దర్శకులు మన ఇండస్ట్రీలో తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు. ఇక మన తెలుగు సినిమాలు చాలావరకు హిందీలో రిలీజ్ అయ్యాయి బాహుబలి, కే జి ఎఫ్, పుష్ప వంటి సినిమాలు ఆ జాబితాలో ఉన్నాయి. హిందీ లో సైతం భారీ కలెక్షన్స్ రాబట్టాయి ఈ చిత్రాలు. ఇక హిందీ సినిమాలు డబ్బింగ్ విషయాల విషయంలో ఇప్పటికే చాలా వార్తలు వినిపించాయి.

డబ్బింగ్ లో డైలాగ్స్ సరైన విధంగా లేకపోవడంతో చాలామంది విమర్శిస్తున్నారు. ఇక అందువల్లే రామాయణం మూవీ డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని దర్శకుడు నితీష్ తివారి డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం సౌత్ డైరెక్టర్స్ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం పై ఎవరైనా డైలాగ్స్ రాయగలరు అనుకుంటే అది వన్ అండ్ ఓన్లీ త్రివిక్రమ్ అనే చెప్పుకోవచ్చు. ఈయన ప్రతి సినిమాలోనూ రామాయణం నుంచి ఏదో ఒక డైలాగ్ పెడుతూనే ఉంటాడు. మొదటినుంచి త్రివిక్రమ్ కి రామాయణం పై ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. కానీ తాను చేయాలనుకున్న ప్రాజెక్ట్ ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతుంది.

ఇక ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా మరియు యష్ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. నిత్యం ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ రామాయణం విషయంలో ఆరితే రాడు. అందువల్లే దర్శకుడు ఈయనకి మాటలను సమకూర్చమని చెప్పినట్లు తెలుస్తుంది. ఏదేమైనా తన కథను పక్కన వారు చేస్తున్నప్పటికీ అందులో ఒక పార్ట్ గా త్రివిక్రమ్ కూడా ఉండడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు.