సినీ ఇండస్ట్రీలో నటి పూనం కౌర్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న.. ఈ అమ్మడు తన నటన, అందంతో సౌత్ ప్రేక్షకుల ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎప్పుడూ హద్దులు దాటకుండా.. ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ నటించేది. ఇక ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.
సినిమాలో లిమిట్ దాటని ఈ బ్యూటీ హద్దులు చెరిపేసి మరీ ఫోటో షూట్లతో కూరాళ్ళను టెంప్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కాంట్రవర్షియల్ బ్యూటీగా పోనామ్ కౌర్కు పేరు వచ్చేసింది. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గొడవల్లో చిక్కుకునే పూనమ్ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. వైసిపి కోవిడ్ మహమ్మారి టైంలో చేనేత కార్మికుల కోసం ఎంతో సహాయ పడిందని.
ఎన్నో మంచి పనులు చేసిందని.. చేనేత కార్మికుల సమస్యలకు క్రియాశీలకంగా.. పనిచేసే కార్యకర్తగా ఇది చెప్తున్నాను అని.. వైసిపి కరోనా టైంలో వీరికి అండగా నిలబడటం నాకు చాలా సంతోషాన్ని కల్పించిందని.. ఇది గొప్ప విషయంగా భావిస్తున్నాను అంటూ ట్విటర్ వేదికగా సీఎం జగన్ ను ప్రశంసిస్తూ.. ఓ పోస్ట్ ని షేర్ చేసుకుంది. అయితే ఎప్పుడు ఎవరో ఒకరిపై కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకొనే ఈ ముద్దుగుమ్మ ఎలక్షన్స్ సమయంలో జగన్ను ప్రశంసిస్తూ పోస్ట్ షేర్ చేయడంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అందరూ ఆమె జగన్ను ప్రసంసించడంతో షాక్ అవుతున్నారు.