ఇక్కడే కాదు పాకిస్తాన్ లోనూ హిట్ అయిన మహేష్ మూవీ.. మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా..

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక అందులో భాగంగానే మహేష్ చివ‌రిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను ప‌ల‌క‌రించాడు. భారీ అంచనాలతో రిలీజైన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ని ద‌క్కించుకుంది. ఇక థియేటర్స్‌లో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటిటిలో మాత్రం ఈ సినిమాను ప్రేక్ష‌కులు బాగా అద‌రిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలలో అంతంతమాత్రంగానే ఉన్న ఈ గుంటూరు కారం మూవీ.. దాయాదుల దేశం పాకిస్థాన్‌లో మాత్రం ఇక్క‌డ‌కు పూర్తి విరుద్ధంగా కొన‌సాగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు వాళ కంటే గుంటూరు కారం శ‌త్రు దేశాం ప్రేక్ష‌కుల‌కు న‌షాలానికి అంటింది.

ఈ కారం చాలా ఘాటుగా మతి చెడేలా ఉంది అంటూ అక్కడ ప్రజలంతా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులోను, భార‌త్‌లోని ఇతర భాషల్లో ఫ్లాప్ అయినా పాకిస్తానీలకు మాత్రం ఈ మూవీ విప‌రీతంగా న‌చ్చేసింది. ఈ విష‌యాని తాజా ఓటీటీ చార్టులు వెల్ల‌డిస్తున్నాయి. ఓటీటీలో రిలీజైన గుంటూరు కారం సినిమాను పాక్ ప్ర‌జ‌లు ఐదు వారాల పాటు ఎగబడి చూసేయడం గ‌మ‌నార్హం. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్‌లో అన్వేషిప్పిన్ కందెతుమ్ , మెర్రీ క్రిస్మస్ లాంటి సినిమాలు అంద‌రిని ఆక‌ట్టుకోవ‌డంలో అగ్రస్థానంలో నిలిచాయి.

అయితే మహేష్‌ గుంటూరు కారం మూవీ వరుసగా ఐదవ వారంలోను ఈ లిస్ట్‌లో నిలిచిన ఈ మూవీ పాకిస్తానీలకు బాగా నచ్చేయడం ఆశ్చర్యక‌ర‌మైన‌ విషయం. ఈ సినిమా బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీక్లీ చార్టులలో ఐదు వారాల ప్రదర్శనను కొనసాగించడం నిజంగానే షాక్‌ను క‌ల్పిస్తుంది.. కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో దేశ విదేశాల్లో గొప్ప రెస్పాన్స్ అందుకుంది. కాగా ప్రస్తుతం గుంటూరు కారంకి పాకిస్తాన్‌లో వస్తున్న ఈ స్పందనను మహేష్ అభిమానులు నెటింట షేర్ చేస్తూ.. ఈ విష‌యాని తెగ వైర‌ల్ చేస్తున్నారు.