సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సడ్ టాక్ను తెచ్చుకుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్ తన నెక్స్ట్ మూవీ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళితో జతకటనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ వివరించారు.
ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కించేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీ సెట్స్ పైకి కూడా రాకముందే ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు.. హైదరాబాద్ లోని తన సినీ థియేటర్లో సందడి చేశాడు. తాజాగా రిలీజై హిట్ టాక్ అందుకున్న మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు సినిమాను మల్టీప్లెక్స్ లో భార్య నమ్రత శిరోథ్కర్ తో కలిసి వీక్షించాడు.
ఈ సినిమాకు మహేష్ జంట కలిసి వచ్చి సందడి చేశారు. సినిమా చూసి వెళ్తున్న వీడియోను అభిమానులు ఈ ంటను వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు సతీమణితో కలిసి చూసిన ఈ ప్రేమలు సినిమా రాజమౌళి కొడుకు ఎస్. ఎస్. కార్తికేయ తెలుగులో డబ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. మరి మహేష్, నమ్రతల జంట ఈ సినిమాకు ఎలాంటి రివ్యూ ఇస్తారో వేచి చూడాలి.