ఆ హిట్ సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్ కు వెళ్లిన మహేష్ దంపతులు.. ఏ మూవీ అంటే..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్‌ తన నెక్స్ట్ మూవీ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళితో జతకటనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ వివరించారు.

ఈ మూవీని పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో తెర‌కెక్కించేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీ సెట్స్‌ పైకి కూడా రాకముందే ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు.. హైదరాబాద్ లోని తన సినీ థియేటర్లో సందడి చేశాడు. తాజాగా రిలీజై హిట్ టాక్ అందుకున్న మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు సినిమాను మల్టీప్లెక్స్ లో భార్య‌ నమ్రత శిరోథ్క‌ర్ తో కలిసి వీక్షించాడు.

Movie Review: Premalu (Telugu)

ఈ సినిమాకు మహేష్ జంట కలిసి వచ్చి సందడి చేశారు. సినిమా చూసి వెళ్తున్న వీడియోను అభిమానులు ఈ ంట‌ను వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు సతీమణితో కలిసి చూసిన ఈ ప్రేమలు సినిమా రాజమౌళి కొడుకు ఎస్. ఎస్. కార్తికేయ తెలుగులో డబ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. మరి మహేష్, నమ్రతల జంట ఈ సినిమాకు ఎలాంటి రివ్యూ ఇస్తారో వేచి చూడాలి.