టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడిపింది. అయితే ప్రస్తుతం ఇదే రేంజ్ లో శ్రీలీలకు పోటీ ఇస్తూ మరో టాలీవుడ్ హీరోయిన్ తయారయింది. ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మూడేళ్లు అవుతుంది. కాగా మొదటి సినిమా పెద్దగా సక్సెస్ అందించలేదు. ఇప్పుడు అత్యంత బిజీ హీరోయిన్స్ లో ఈమె మొదటి వరుసలో ఉంది. లేటెస్ట్ గా ఆమె కొత్త సినిమాలలో నటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. టాలీవుడ్లో శ్రీలీలను మించిపోయేంతలా ఈ బ్యూటీ వరుస ఆఫర్లను దక్కించుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెనే మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
తర్వాత రవితేజ జంటగా ఖిలాడి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది. సినిమా హిట్ కాకపోయినా ఆమెకు ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత హిట్ 2 లో అడవిశేష్ జంటగా నటించి మెప్పించింది. కాస్త రొమాంటిక్ కోణంలో బెడ్ సీన్స్లో రెచ్చిపోయింది. ఈ సినిమా మీనాక్షి కెరీర్ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత మీనాక్షి పేరు టాలీవుడ్ లో చాలా వరకు వినిపించింది. ఇక ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో నటించింది. మహేష్ బాబు సరసన ఛాన్స్ దొరకడం ఈ అమ్మడుకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈమె పాత్ర నడివి చాలా తక్కువ సేపు అయినా పర్ఫామెన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో బిజీ హీరోయిన్గా మారిపోయింది మీనాక్షి చౌదరి.
యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆమె వరుణ్ తేజ్ మట్కా సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభరలోనూ ఈమె ఫిక్స్ అయింది. చిరంజీవి అయిదుగురు సోదరులలో ఈమె కూడా ఒకరిగా మెప్పించనుంది. అలాగే వెంకటేష్ నెక్స్ట్ మూవీ కి కూడా మీనాక్షి చౌదరి ఫిక్స్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న వెంకటేష్ సినిమాలో ఈమె నటించన్నుంది. దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ సినిమాలో కనిపించనుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.
అలాగే విజయ్ దళపతి శాసన గోట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే విజయ్ 69వ మూవీ, మరోవైపు విశ్వక్సేన్ తో ఓ సినిమాను మీనాక్షి చౌదరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుందిజ ఇలా ఎప్పుడూ ఆమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. ఇలా ఒకేసారి అరటిజెన్ పైగా సినిమాలతో నిన్న మొన్నటి వరకు శ్రీలీల పేరు మోగిపోయింది. అంతకుముందు కృతి శెట్టి, పూజ హెగ్డే పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. కెరీర్ స్టార్టింగ్ లో హిట్ పడడంతో వరుసగా ఆఫర్లు రావడంతో వెనక్కు పంపడం ఎందుకు అని స్టోరీ తో సంబంధం లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తీరా సినిమాలు బోల్తా పడ్డాయి. ఇటీవల శ్రీ లీల అంతకుముందు కృతి శెట్టి, పూజా హెగ్డేకు కూడా అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా ఖాళీ అయిపోతున్నారు. ఇక మీనాక్షి చౌదరి టైం వచ్చింది. ఇక మీనాక్షి చౌదరి అయిన కథల విషయంలో జగ్రతగా నటిస్తుందా.. శ్రీ లీలా, పూజా హెగ్డే, కృతి శెట్టిలా మీనాక్షి కూడా బోల్తా పడుతుందో చూడాలి.