మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఏరియాలో ‘ ఆపరేషన్ వాలెంటైన్ ‘ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..

టాలీవుడ్ మెగా ప్రిన్స్ ఇటీవ‌ల‌ నటించిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ప్రస్తుతం వ‌రుణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్ల‌ర హీరోయిన్గా.. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ తెలుగులోనే మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ సినిమా కావ‌డం విశేషం. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏరియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో.. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Operation Valentine Satellite Rights Bagged For Fancy Amount

సినిమాపై మరింత హైప్‌ పెంచేందుకు వరుణ్ తేజ్ తో పాటు సినిమా మేకర్స్ కూడా ప‌లు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షోలను వైమానిక ధ‌ళాల స్పెషల్ ఆఫీసర్లు చూశారని.. వారు ఇప్పటివరకు పోలవామ ఘ‌ట‌న‌పై తెరకెక్కిన అన్ని సినిమాల్లో ఇది ది బెస్ట్ సినిమా అంటూ ప్రశంసించినట్లు వివరించాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ పైలెట్ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నాడు.

ఈ సినిమాల్లో వాలెంటైల్ దేశం కోసం యుద్ధం చేస్తాడని.. దేశాన్ని ప్రేమిస్తాడని ఆయన వివరించాడు. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలో నవ‌దీప్‌, రూహిణి శర్మ కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధ‌ర‌ల‌కు అమ్ముడుపోయాయి. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ టీం నుంచి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఈ సినిమా నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారట. ఇక నైజాంలో ఈ సినిమా థియేట్రిక‌ల్‌ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం నైజం లో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.